
కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయండి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యాపారానికి తెర లేపాయన్నారు. ముందస్తు అడ్మిషన్లు తీసుకోవడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని అన్నారు. ఒక్క పాఠశాలకు పర్మిషన్ తీసుకొని నాలుగైదు చోట్ల బ్రాంచ్లుగా ఏర్పాటు చేసి నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల దోపిడీపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అడ్మిషన్లు పెంచేలా విద్యాధికారులు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను ఆపకుంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, జిల్లా నాయకులు జక్కుల అనిరుద్ , సిద్ధుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.