
నూతనోత్సాహంతో పనిచేయండి
● పోలీసు కమిషనర్ అనురాధ
● ‘ఉత్తమ’ పోలీసులకు అభినందనలు
సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పతకాలు పొందిన పొలీస్ సిబ్బంది, అధికారులు ఇదే స్ఫూర్తితో నూతనోత్సాహంతో పనిచేయాలని పోలీసు కమిషనర్ అనురాధ సూచించారు. అవార్డులు పొందిన చేర్యాల సీఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మిస్బావుద్దిన్, మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ దుర్గ, ట్రాఫిక్ ఎస్ఐ రఘులు మర్యాదపూర్వకంగా మంగళవారం సీపీని కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ వారిని అభినందించి, సన్మానించారు. సీపీ మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాల రవాణా, కొనుగోళ్లపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలన్నారు.