
నంబరు ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు
● జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
సిరిసిల్ల: వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ఆదివారం తెలిపారు. పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈనెల 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకుంటే రవాణా, పోలీసుశాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సోషల్మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దని కోరారు.