కేసీఆర్‌ పార్టీ పెట్టకుంటే తెలంగాణ వచ్చేదే కాదు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పార్టీ పెట్టకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

Apr 23 2025 9:39 AM | Updated on Apr 23 2025 9:39 AM

కేసీఆర్‌ పార్టీ పెట్టకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

కేసీఆర్‌ పార్టీ పెట్టకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

సిరిసిల్ల: కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌)పార్టీని పెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టులు రాక, సాగునీరు లేక.. ఇన్ని పంటలు పండేవి కావని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. తెలంగాణ సాధన ఆకాంక్ష 1960లో మొదలై 360 మంది విద్యార్థుల బలిదానాలతో సాగిందన్నారు. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబు ఇది మూణ్ణాళ్ల ముచ్చటే అని కొట్టిపారేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ జెండాను ఎత్తుకున్న కేసీఆర్‌ ఐదుగురు ఎంపీలతో 32 జాతీయ పార్టీల అంగీకారాన్ని సాధించి తెలంగాణ సాధించారని వివరించారు. బీఆర్‌ఎస్‌ పాతికేళ్ల ఆవిర్భావ వేడుకలకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని, అన్ని ఏర్పాట్లు బాగా చేశామన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరేసి సభకు రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి మూడేళ్లే.. టీఆర్‌ఎస్‌కు పాతికేళ్లు అంటున్న కాంగ్రెస్‌, బీజేపీ నేతల తీరును వినోద్‌కుమార్‌ తప్పుబట్టారు. ఎన్నిసార్లు కాంగ్రెస్‌, బీజేపీలు పేర్లు మార్చుకున్నాయో చరిత్రను చూడాలని, గుర్తులను కూడా మార్చుకున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో వేములవాడ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళ, నాయకులు గూడూరి ప్రవీణ్‌, ఆకునూరి శంకరయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్‌, సిద్ధం వేణు, మాట్ల మధు, చీటి లక్ష్మణ్‌రావు, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, గడ్డం నాగరాజు, కుంబాల మల్లారెడ్డి, జక్కుల నాగరాజుయాదవ్‌, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement