సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం

May 3 2025 8:27 AM | Updated on May 3 2025 8:27 AM

సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం

సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం

రేపు సింగరాయకొండలో

సింగరాయకొండ: కొండపి నియోజకవర్గ ప్రజల కల అయిన సివిల్‌ జడ్జి కోర్టు(జూనియర్‌ విభాగం) ఆదివారం సింగరాయకొండలో ప్రారంభం కానున్నట్లు స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి టి.రాజశేఖరరావు, హైకోర్టు జడ్జిలు డాక్టర్‌ కె.మన్మథరావు, జి.రామకృష్ణ ప్రసాద్‌, డాక్టర్‌ వై.లక్ష్మణరావు, జిల్లా జడ్జి భారతి పాల్గొంటారని వివరించారు.

ఐదు మండలాలకు ప్రయోజనం

సింగరాయకొండలో సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటుతో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు, కొండపి, పొన్నలూరు మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ ఐదు మండలాల పోలీస్‌స్టేషన్లతో పాటు సింగరాయకొండ ఎకై ్సజ్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా ఈ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఐదు మండలాలు నూతన కోర్టు పరిధిలోకి రావడంతో కేసులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి మండలాలు కందుకూరు కోర్టు పరిధిలో, టంగుటూరు మండలం ఒంగోలు కోర్టు పరిధిలో ఉండేవి. ఈ కోర్టు ఏర్పాటుతో సివిల్‌, క్రిమినల్‌ కేసులకు సంబంధించి కందుకూరు కోర్టుతో ఇక ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కోర్టులో వచ్చే తీర్పులకు అప్పీలు చేసుకోవాలన్నా అప్పిలేట్‌ కోర్టుగా ఒంగోలు కోర్టు ఉంటుందని న్యాయవాదులు వివరించారు. ప్రస్తుతం ఐదు మండలాల్లో సుమారు 4 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

హాజరు కానున్న హైకోర్టు జడ్జిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement