చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

Oct 7 2025 3:41 AM | Updated on Oct 7 2025 3:41 AM

చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు ● జీఎస్టీని రెండు స్లాబులకు పరిమితం చేయడం వలన చేనేత కార్మికులకు,పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి రాజధాని తప్ప రైతుల గోడు, చేనేత కార్మికుల గోడు పట్టలేదన్నారు. మహాసభల సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికులతో భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో చేనేత రంగ పరిరక్షణకై సమగ్ర విధానాన్ని ప్రకటించాలని. జీఎస్టీని రద్దు చేయాలని, ప్రతి చేనేత కార్మికునికి నేతను నేస్తం అమలు చేయాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వాలని నినాదాలు చేశారు. సభలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేనేత కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామనాథం పూర్ణచంద్రరావు, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ మన్నూరు భాస్కరయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామార్తి రాజు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డోకిపర్తి రామారావులు మాట్లాడారు. అనంతరం జరిగిన ప్రతినిధుల మహాసభలో సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మూడు సంవత్సరాల కాలంలోని కార్యక్రమాల కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.

చేనేత రంగ పరిరక్షణకు సమగ్ర విధానం ప్రకటించాలి ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

సత్తెనపల్లి: చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయని, చేనేత రంగ పరిరక్షణకై సమగ్ర విధానాన్ని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గ రావు అధ్యక్షత వహించారు. ముందుగా మహాసభల ప్రాంగణం ముందు సంఘం జెండాను చేనేత కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు అనంత పిచ్చయ్య ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది కార్మికులు ఆధారపడి పనిచేస్తున్న చేనేత రంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని తీసుకురావడంతో ఆ రంగం మరింత నిర్వీర్యమైందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు మరింత పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలలో చేనేత రంగ పరిరక్షణకు ప్రభుత్వాలు సమగ్ర విధానాన్ని ప్రకటించాలని, చేనేతరంగంపై జీరో జీఎస్టీని ప్రకటించాలని,లేబర్‌ కోడ్‌లు రద్దుచేసి పనిగంటలను తగ్గించాలని, ‘సర్వశిక్ష‘ ద్వారా పాఠశాల విద్యార్థు లందరూ చేనేత దుస్తులు వాడుకునేటట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేయాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement