‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ

Oct 6 2025 2:42 AM | Updated on Oct 6 2025 9:23 AM

‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ

‘పచ్చ’ పార్టీలో రచ్చ రచ్చ

● వేమూరులో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. మాజీ మార్కెట్‌ యార్టు చైర్మన్‌ జొన్నలగడ్డ విజయ్‌బాబు, చావలికి చెందిన మండల పార్టీ మాజీ అధ్యక్షుడు దండె సుబ్బారావుల మధ్య గొడవలు ఉన్నాయి. విజయ్‌బాబు వ్యతిరేకత వ్యక్తం చేయడంతోనే దండె సుబ్బారావును మండల టీడీపీ అధ్యక్ష పదవి నుంచి ఎమ్మెల్యే తొలగించారు. ● అమృతలూరులో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పూర్ణకుమారి భర్త గొట్టిపాటి గంగాధర్‌, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్‌ల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. గంగాధర్‌కు ఎమ్మెల్యే మద్దతు పలుకుతుండడంతో రత్నప్రసాద్‌ వర్గం మండిపడుతోంది. ● భట్టిప్రోలు మండలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూముగుంట్ల సాయిబాబా, పార్టీ నేత భట్టు మల్లికార్జునరావుల మధ్య విబేధాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మద్దతు భట్టు మల్లికార్జునరావుకు ఉందని ప్రచారం జరుగుతోంది. సాయిబాబా వర్గీయులు ఎమ్మెల్యేకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మండల, గ్రామ స్థాయిలోనూ కేడర్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ● చుండూరు మండల టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఆ పార్టీలో వర్గాలను మరింతగా రాజేసింది. చుండూరుకు చెందిన యల్లారెడ్డి, వలివేరుకు చెందిన తమ్మా శివారెడ్డిలు మండల పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. శివారెడ్డికి ఎమ్మెల్యే మద్దతు ఇచ్చి పదవి కట్టబెట్టడంతో యల్లారెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది.

వర్గాలుగా విడిపోయిన తమ్ముళ్లు అక్రమాల కోసం ఎమ్మెల్యే ప్రోత్సాహం వేమూరులో పరస్పరం దాడులు పోలీసు సహా పలువురికి గాయాలు

అక్రమార్జనలో ఆరితేరిన తమ్ముళ్లు ఇప్పుడు కొట్లాటలకు సైతం వెనుకాడం లేదు. పదవుల నుంచి ఇసుక దందా, మట్టి తరలింపు, మద్యం మాఫియా, బియ్యం అక్రమరవాణా... ఇలా పలు అంశాల్లో తాము చెప్పినట్లే జరగాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మండల, గ్రామ స్థాయి పచ్చనేతల తీరు ఇలా ఉండటంతో వర్గ విభేదాలు పెరిగాయి. ఆధిపత్యం చాటేందుకు తన్నుకోవడానికై నా సై అంటున్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పచ్చపార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. శుక్రవారం కొల్లూరు మండల నేతలు డాక్టర్‌ కనగాల మధుసూదన్‌, మైనేని మురళి వర్గాలు రోడ్డున పడి తన్నుకున్నాయి. నక్కా సమక్షంలోనే డాక్టర్‌పై మురళి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ప్రతిగా డాక్టర్‌ వర్గీయులు వారిని కొట్టారు. ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలు కాగా, అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌కు సైతం గాయాలు తప్పలేదు. ఇంత జరిగినా కేసులు లేవు.

అంతటా అదే తంతు..

అక్రమాలకు వారే కీలకం

ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రోత్సహిస్తున్న వర్గీయులకు పదవులు దక్కుతున్నాయి. దీంతోపాటు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, బియ్యం దందాను నడిపిస్తున్నారు. కొల్లూరులో ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్న మైనేని మురళి వర్గం ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్న వర్గాలు కూడా బియ్యం, లిక్కర్‌, బెల్టు షాపుల దందా చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement