స్థానిక పోరుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుకు సన్నద్ధం

Sep 23 2025 10:47 AM | Updated on Sep 23 2025 10:47 AM

స్థానిక పోరుకు సన్నద్ధం

స్థానిక పోరుకు సన్నద్ధం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్‌, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి.

ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ

కలెక్టర్‌, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement