
మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 5,854 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 532 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 49 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రం వరకు 644.05 అడుగులు (4.21 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.