
‘పది’లో జయ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 587 మార్కులు, 15 మంది విద్యార్థులు 580పైగా మార్కులు, 52 మంది విద్యార్థులు 570పైగా మార్కులు, 106 మంది విద్యార్థులు 560 పైగా, 154 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు. వి. హాసిని, కె. శ్రేష్ట, ఎం. అనన్య, ఎం. శ్రీదేవి 587 మార్కులు, కె. శరణ్య 586 మార్కులు, లోకేష్ 585, సాయి చర్విత, శ్రీజ 584 మార్కులు, చాణక్య, హర్షవర్దని 583 మార్కులు, రేవంత్రెడ్డి, మన్విత, ప్రగతి, వేద 580 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు అభినందించారు.