గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

May 1 2025 1:54 AM | Updated on May 1 2025 1:54 AM

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్‌ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా వెంకట్రావ్‌ను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా బాధ్యతలు అప్పగించింది. బుధవారం సాయంత్రం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఈఓ చాంబర్‌లో బాధ్యతలు స్కీరించారు. ఆలయ రికార్డులను, పత్రాలను బదిలీ అయిన భాస్కర్‌రావు నూతన ఈఓకు అప్పగించారు. నూతన ఈఓ, బదిలీపై వెళ్తున్న భాస్కర్‌రావును అర్చకులు, ఆలయ ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నూతన ఈఓ క్యూలైన్‌లో నిల్చున్న భక్తులను పలకరించారు. దర్శనానికి ఎక్కడి నుంచి వచ్చారు, క్యూలైన్లలో ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే పెండింగ్‌ పనులు, నూతన నిర్మాణాలు, పూజలకు సంబంధించిన అంశాలను అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పాత ఈఓ భాస్కర్‌రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా భాస్కర్‌రావుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement