అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం | - | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం

May 1 2025 1:53 AM | Updated on May 1 2025 1:53 AM

అక్షయ

అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం

రామగిరి(నల్లగొండ): అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి వస్తున్నా.. పసిడి ధర తులం రూ.లక్షకు చేరువలో ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా ఈసారి బంగారం కొనుగోళ్లు పది శాతం మాత్రమే జరిగినట్టు అమ్మకందారులు చెబుతున్నారు. గతేడాది అక్షయ తృతీయ సమయంలో బంగారం ధర తులానికి సుమారు రూ.60 నుంచి రూ.65 వేల వరకు ఉంది. ప్రస్తుతం రూ.98 వేలు ఉంది. గత ఏడాది రేటుతో పోల్చితే 40 నుంచి 45 శాతం మేర వ్యత్యాసం కనిపిస్తోంది.

ఫ రూ.లక్షకు చేరువగా తులం బంగారం

ఫ అధిక ధర కారణంగా తగ్గిన కొనుగోళ్లు

అక్షయ తృతీయ అంటే సెంటిమెంట్‌

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం సెంటిమెంట్‌. ఏటా అక్షయ తృతీయకు బంగారం కొంటాము. ఈ సారి బంగారం ధర ఎక్కువగా ఉండడంతో చాలా తక్కువ కొనుగోలు చేశాం. – మల్లికా, నల్లగొండ

అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం1
1/1

అక్షయ తృతీయపై పసిడి ధరల ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement