
సమస్యలు తీరేనా...?
మున్సిపాలిటీలలో గత ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పినా అది మాత్రం కార్యాచరణలో కనపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం అదేరీతిలో వందరోజుల ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని రూపొందించినా అది అలా కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డులలో దీర్ఘకాలికంగా సమస్యలు వేధిస్తున్నా గెలిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాటి పేరుతో పబ్బం గడిపారని విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా పట్టణ ప్రణాళికలో భాగంగా వార్డులలో చేపట్టే పనులను పూర్తి శ్రద్ధతో చేసి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
సిబ్బందిని సమాయత్తం చేశాం
పట్టణ ప్రణాళికలో భాగంగా వందరోజుల యాక్షన్ ప్లాన్కు తగ్గట్టుగా మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని సమాయత్తం చేశాం. యాక్షన్ ప్లాన్లో సూచించిన విధంగా ఒక్కో పనిని ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది చేపట్టి, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నోట్ చేసుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం, వాటి అమలుపై రోజువారీ రిపోర్టులను సైతం తయారు చేస్తాం.
– మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
●