చినుకుపడితే చిత్తడి | - | Sakshi
Sakshi News home page

చినుకుపడితే చిత్తడి

Oct 4 2025 8:10 AM | Updated on Oct 4 2025 8:10 AM

చినుకుపడితే చిత్తడి

చినుకుపడితే చిత్తడి

చినుకుపడితే చిత్తడి

ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గుంతల్లో నిలిచిన నీరు

ఇబ్బందులు పడుతున్న

వాహనదారులు, ప్రజలు

వెంకటాపురం(కె): చినుకుపడితే మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారి చిత్తడిగా మారుతోంది. గుంతల్లో వరదనీరు నిల్వ ఉండి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ఉన్న ఈ రోడ్డు గుంతలుగా మారింది. వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. కాగా, ఈ రోడ్డుపై వాహనదారులు వెళ్లేందుకు పాట్లు పడుతున్నారు. ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతూ రోడ్డు దాటి బస్టాండ్‌ వెళ్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement