
లోగో డిజైన్ కమిటీ సభ్యుడిగా నారాయణ
కేయూ క్యాంపస్: ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మక్కసారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను రూపొందించేందుకు ఆ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ లోగో డిజైన్ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. ఆకమిటీలో కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ ఈసం నారాయణను సభ్యుడిగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు యూనివర్సిటీకి పంపగా.. వీసీ ప్రతాప్రెడ్డి ఈసం నారాయణకు అందించి అభినందించారు. లోగో డిజైన్ కమిటీ చైర్మన్గా ట్రైబల్ యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. మరో ఇద్దరు సభ్యులుగా ఇతర యూనివర్సిటీలకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేసిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్రావు ఉన్నారు.
ఓరుగల్లు పీఠం
పాలనాధికారిగా విజయపాల్రెడ్డి
కాజీపేట రూరల్: ఓరుగల్లు మేత్రాసనం క్యాథలిక్ పీఠం పాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్)గా పి. విజయపాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన విజయపాల్రెడ్డి 1992లో క్యాథలిక్ గురువుగా పదోన్నతి పొందారు. తర్వాత ఫాతిమా బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్గా, ఫాతిమా లోడి సంస్థ డైరక్టర్గా సేవలందించి ఇక్కడి నుంచి జనగామ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఓరుగల్లు పీఠాధిపతిగా ఉన్న బిఫప్ ఉడమలబాల ఇటీవల పదోన్నతిపై వి శాఖపట్నం ఆర్చీ బిషప్గా వెళ్లడంతో అప్పటి నుంచి ఓరుగల్లు క్యాథలిక్ పీఠానికి బిషప్ లే రు. కొత్త బిషఫ్ ఎంపిక ఆలస్యం అవుతున్న నే పథ్యంలో ఓరుగల్లు క్యాథలిక్ డయాసిస్ కౌన్సి ల్ వారు విజయపాల్రెడ్డిని పాలనాధికారిగా ఎన్నుకున్నట్లు గురువారం వారు తెలిపారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మామునూరు: ఆర్థిక ఇబ్బందులతో మామునూరుకు చెందిన గూడెం రాజ్కుమార్(24) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్కుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోదరి వివాహానికి మొత్తం ఖర్చు తానే భరిస్తానని తల్లికి మాట ఇచ్చాడు. పెళ్లి తేదీ సమీపిస్తుండడంతో డబ్బులు సర్దుబాటు కాలేదని మనస్తాపం చెంది రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.

లోగో డిజైన్ కమిటీ సభ్యుడిగా నారాయణ

లోగో డిజైన్ కమిటీ సభ్యుడిగా నారాయణ