
జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కై లాస్యాదవ్
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన బైరబోయిన కై లాస్యాదవ్ ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో హైదరాబాద్ నాంపల్లిలో జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు నిర్వహించగా, అంతర్జాతీయ క్రీడాపోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలను నిలిపివేశారు. కాగా, గురువారం తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల నూతన కమిటీ జాబితాను జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ అలహాబాద్ రిటైర్డ్ జడ్జి ఫంకజ్ నఖ్వీ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురికి పదవులు దక్కాయి. రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా డి.సంతోశ్, బి.సాయిరాం యాదవ్, టెక్నికల్ కమిటీ చైర్మన్గా సీహెచ్.రాము, టెక్నికల్ కమిటీ సెక్రటరీగా నాగరాజు ఎన్నికయ్యారు. వారంతా నాలుగేళ్లపాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు.
టీజీఆర్జేసీ ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఈ నెల 10న నిర్వహించనున్న టీజీఆర్జేసీ సెట్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆ సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ కె.ఇందుమతి గురువారం తెలిపారు. హనుమకొండలో 32 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 7,564 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్టికెట్లు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, కిషన్పురలో చైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రం అని హాల్టికెట్లు జారీ అయిన అభ్యర్థులకు హనుమకొండలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ సెంటర్కు మార్చారని, గమనించాలని ఆమె కోరారు.
● సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఇందుమతి