పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన

May 8 2025 9:15 AM | Updated on May 8 2025 9:15 AM

పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన

పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘటన

పెద్దవంగర: కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడంతో ఓ రైతు తన ధాన్యం బస్తాలకు పెట్రోల్‌ పోస్తానని హెచ్చరిస్తూ నిరసన తెలిపిన ఘటన మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సోమ్లాతండాకు చెందిన గుగులోత్‌ రవి తాను పండించిన ధాన్యాన్ని మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ఆరబోసిన అనంతరం ఐదు రోజుల క్రితం కాంటా పెట్టారు. అయితే తనకంటే వెనుక కాంటా పెట్టిన ధాన్నాన్ని లారీలో మిల్లుకు తరలించారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షంతో ఆ రైతు బస్తాలు తడిసిపోయాయి. ముడుపులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మిల్లుకు తరలిస్తున్నారనే విషయం ఆ రైతు గ్రహించాడు. దీంతో కలత చెందిన ఆయన కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పెట్రోల్‌ బాటిల్‌తో వాగ్వాదానికి దిగాడు. పైసలిస్తేనే లారీలో తరలిస్తారా.. అంటూ పెట్రోల్‌ పోసి ధాన్యాన్ని కాలుస్తానని హెచ్చరించాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందిచండంతో ఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతును శాంతిపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement