వడదెబ్బతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మహిళ మృతి

May 6 2025 12:38 AM | Updated on May 6 2025 12:38 AM

వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో మహిళ మృతి

గార్ల : వడదెబ్బతో మహిళ మృతిచెందిన సంఘటన సోమవారం గార్లలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్లలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన అక్కి పార్వతి (51) రెండ్రోజుల క్రితం మిరప తోటలో కాయలు ఏరేందుకు పనికి వెళ్లింది. ఆదివారం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు సీహెచ్‌సీకి తరలించగా, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని డాక్టర్‌ రాజ్‌కుమార్‌జాదవ్‌, తహసీల్దార్‌ ఆర్‌.శారద, ఎస్సై ఎస్‌కె రియాజ్‌పాషా సందర్శించి ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement