
‘రైతుల కష్టాలు కనిపించడం లేదా?’
కూసుమంచి: జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. మండలంలోని చేగొమ్మ, మల్లేపల్లిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించిన ఆయన రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోందని, మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోకపవడం సరికాదని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు మల్లెల హన్మంతరావు, తోటకూరి రాజశేఖర్, బిక్కసాని గంగాధర్, కర్ణబాబు, రవి, రాధాకృష్ణ, ప్రతాప్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
కులగణన నిర్ణయం
హర్షణీయం
ఖమ్మంవన్టౌన్: దేశమంతటా కులగణన చేపట్టాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆలోచనలతో తెలంగాణలో చేపట్టిన గణన దేశమంతటా చేపట్టాలని నిర్ణయించారని వారు పేర్కొన్నారు. ఈమేరకు ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పీసీసీ పరిశీలకుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాహుల్గాంధీ జోడోయాత్రలో చెప్పిన విధంగా కులగణన చేసి దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా పరిశీలకుడు బత్తిన శ్రీనివాసరావు, నాయకులు పులి అనిల్కుమార్, నాగండ్ల దీపక్చౌదరీ, కొత్తా సీతా రాములు, పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్గౌడ్, బొడ్డు బొందయ్య,సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాద సొసైటీ
అధ్యక్షుడిగా రాజశేఖరరెడ్డి
ఖమ్మం లీగల్: ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాల్లో ఎన్నికలు నిర్వహించగా నాలుగు డైరెక్టర్ పదవులకు గాను 549 ఓటర్లలో 429 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈమేరకు ఆవుల అనురాధ 308ఓట్ల ఆధిక్యంతో, షేక్ నస్రీన్, 291, కాసర రాజశేఖరరెడ్డి 261, పాలవెల్లి వెంకటేశ్వర్లు 242 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారని ఎన్నికల అధికారి జి.రమేష్ ప్రకటించారు. అనంతరం గతంలో ఉన్న డైరెక్టర్లతో కలిపి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా కాసర రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పిడతల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా బిళ్ల క్రాంతికుమారి, సంయుక్త కార్యదర్శిగా పలివెల శ్రీలక్ష్మి, కోశాధికారిగా భూక్యా రమేష్ ఎన్నికయ్యారు.
ప్రజా సంక్షేమమే
బీజేపీ ధ్యేయం
ఖమ్మం మామిళ్లగూడెం: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. జనగణనలో భాగంగా కులగణన కూడా నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యాన ఖమ్మంలో శుక్రవారం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుల గణనకు శ్రీకారం చుడుతుంటే ఆ ఘనత కాంగ్రెస్దిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజామద్దతుతో వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేసిన ఘనత కేంద్రప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, ఈ.వీ.రమేష్, అల్లిక అంజయ్య, నున్నా రవికుమార్, జ్వాలా నర్సింహారావు, మేకల నాగేందర్, టేకుమల్ల వీరూగౌడ్, సుధాకర్, వీరవెల్లి రాజేష్, పమ్మి అనిత, రవిరాథోడ్, ఆర్వీఎస్.యాదవ్, రుద్రగాని మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతుల కష్టాలు కనిపించడం లేదా?’

‘రైతుల కష్టాలు కనిపించడం లేదా?’