భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం

Oct 5 2025 2:20 AM | Updated on Oct 5 2025 2:20 AM

భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం

భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్‌, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement