వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. | - | Sakshi
Sakshi News home page

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

May 28 2025 11:49 AM | Updated on May 28 2025 11:49 AM

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీ వర్ష

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల భారీ వర్ష

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన కోరుట్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. బీఆర్‌ఎస్‌ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోట నారాయణ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌ పాల్గొన్నారు.

ఎన్నికల్లో సత్తా చాటాలి

ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చూపించాలని విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లి పోయినవారిని ఎట్టి పరిస్థితిల్లోనూ తిరిగి తీసుకోబోమని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎలాల దశరథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ఎలేటి చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ రావు

హాజరైన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement