
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మల్లాపూర్: అధికారంకొచ్చిన 18నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత హామీలు, అబద్దపు ప్రచారం చేసి.. ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయలేక చతికిలపడిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఇక్కటీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని, రా నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సా ధిస్తుందని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.