జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లు

Feb 15 2024 12:08 AM | Updated on Feb 15 2024 12:08 AM

వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, పాల్గొన్న అధికారులు
 - Sakshi

వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, పాల్గొన్న అధికారులు

జగిత్యాల: జిల్లావ్యాప్తంగా ఆరు ఇసుక రీచ్‌లు ఏ ర్పాటు చేసినట్లు కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. ధర్మపురి మండలంలో రాజారం, ఆరెపల్లి, కోరుట్లలో పైడిమడుగు, రాయికల్‌ మండలంలో ఇటిక్యా ల, జగన్నాథపూర్‌, మల్లాపూర్‌ మండలంలో సాతా రం, మెట్‌పల్లి మండలంలో ఆత్మకూర్‌, కథలాపూర్‌ మండలంలో తక్కళ్లపల్లిలో ఇసుక రీచ్‌లు గుర్తించా మని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఇసుక వాహనం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇసుక అవసరమైన వారు TSMIV.CGG.GOV.IN ద్వారా ఇసుకను పొందవచ్చని, దూరాన్ని బట్టి ధర ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారుల కోసం హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 040–23120421 లో సంప్రదించాలని సూచించారు. ఇసుక వినియోగంలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఇసుకను ప్రజల అవసరాలకు వినియోగించుకునేలా వెబ్‌సైట్‌ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో సీసీజీ డైరెక్టర్‌ వైఎన్‌. గోపాలకృష్ణ, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, డెప్యూటీ సీఈవో రఘువరణ్‌, మైనింగ్‌ ఏడీ విజయ్‌కుమార్‌, డీపీవో దేవరాజ్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఇసుక వాహనం వెబ్‌సైట్‌ ప్రారంభం

కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement