
రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదాం
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్ర తాప్రెడ్డి అన్నారు. సోమవారం యూనివర్సిటీలోని పరిపాలనభవ నం ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కల తెలంగాణ సాకారం చేసుకున్నామన్నారు. రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారని, అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలన్నారు. రాష్ట్రసాధనలో కాకతీయ యూ నివర్సిటీకీలక పాత్ర వహించిందన్నారు. కేయూ మాజీ వీసీ దివంగత జయశంకర్ భూమిక మన కు గర్వకారణమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మా ట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న క్రమంలో ప్రజలందరి తోడ్పా టు అవసరమన్నారు. కేయూ పాలకమండలి సభ్యులు అనితారెడ్డి, సురేశ్లాల్, రమ, చిర్రరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాలపృథ్వీరాజ్ పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి