కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Jun 3 2025 6:55 AM | Updated on Jun 3 2025 6:55 AM

కేడీస

కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

విద్యారణ్యపురి : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్‌)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల ఫస్టియ ర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను సోమవా రం కేడీసీ కళాశాలలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌, ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌తో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో 39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి, కేడీసీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శివనాగశ్రీను, వైస్‌ ప్రిన్సిపాల్‌ రజనీలత, అధ్యాపకులు త్యాగ య్య, ఇందిరాదేవి, కొమురయ్య, సమ్మయ్య, వెంకన్న, సీతారాములు, ఎం.వెంకన్న, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంగణ నియామకాలు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధి కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని డీఎస్‌కే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఫ్రంట్‌ అండ్‌ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్‌, ఎస్‌.అరవింద్‌, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌రాజు కేయూలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్‌ సిటీలోని డీఎస్‌కే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్‌ చిర్ర రాజు అందజేశారు.

గ్లోబల్‌ యూత్‌ సమ్మిట్‌కు

ప్రియచందన

కేయూ క్యాంపస్‌ : కర్ణాటకలోని మంగుళూరు యోనేసోయి డీమ్డ్‌ యూనివర్సిటీలో ఈనెల 5, 6వ తేదీల్లో జరగబోయే గ్లోబల్‌ యూత్‌ సమ్మిట్‌–2025కు కేయూ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థిని కృతిక ప్రియచందన ఎంపికయ్యారు. ఈమేరకు సోమవా రం కేయూలో వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఈసం నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భిక్షాలు ప్రియచందనను అభినందించారు. గతంలో ప్రియచందన జీ–20 దేశాల ప్రెసిడెన్సీ వక్తృత్వ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి అప్పటి గవర్నర్‌ నుంచి అభినందనలు అందుకున్నారని నారాయణ తెలిపారు.

నియామకం

కేయూ క్యాంపస్‌ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్‌ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి నుంచి నర్సింహా చారి బాధ్యతలను స్వీకరించనున్నారు.

రుద్రేశ్వరుడికి పూజలు

హన్మకొండ కల్చరల్‌ : శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవా రం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకాలు, అర్చనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, మానసిక ప్రశాంతతతో జీవించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

కేడీసీ డిగ్రీ పరీక్షల  ఫలితాలు విడుదల1
1/3

కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

కేడీసీ డిగ్రీ పరీక్షల  ఫలితాలు విడుదల2
2/3

కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

కేడీసీ డిగ్రీ పరీక్షల  ఫలితాలు విడుదల3
3/3

కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement