
తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్సే శాపం
హన్మకొండ: తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేశాక.. కెప్టెన్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వినయ్భాస్కర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, కాంగ్రెస్ పార్టీ నాడు.. నేడు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా.. 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్ధన్, పులి రజనీకాంత్, రామ్మూర్తి, జానకీ రాములు, బొంగు అశోక్, సోదా కిరణ్, ఇమ్మడి రాజు, కడేరావు నర్సింహారావు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, కంజర్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
18 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది
రాజ్యసభ మాజీ సభ్యుడు
కెప్టెన్ లక్ష్మీకాంతరావు