
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యో గ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్, ఎస్సైలు అలీ మహ్మద్, అఫ్జల్ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్రావు, క్రిష్టాచారి, యాకూ బ్ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య పాల్గొన్నారు.