ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

Jun 3 2025 6:55 AM | Updated on Jun 3 2025 6:55 AM

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్‌ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్‌ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యో గ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్‌, ఎస్సైలు అలీ మహ్మద్‌, అఫ్జల్‌ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్‌రావు, క్రిష్టాచారి, యాకూ బ్‌ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌ గుప్తా, కానిస్టేబుల్‌ కొండయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement