జూన్‌ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ

May 31 2025 1:00 AM | Updated on May 31 2025 1:00 AM

జూన్‌ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ

జూన్‌ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట : జిల్లాలో జూన్‌ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డుల మంజూరుపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ‘భూభారతి’లో రైతులనుంచి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యేల ఆమోదంతో పంపిణీ చేయాలన్నారు. రాజీవ్‌ యువ వికాసానికి ఎంపికై న వారికి జూన్‌ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి సురేశ్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్‌ పీడీ గణపతి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement