
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయం
● పట్టుకున్న కంపెనీ బృందం
నెహ్రూసెంటర్ : బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు (ఇంట్లో వినియోగించే విద్యుత్ పరికరాలు) విక్రయిస్తున్న షాపులో కంపెనీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీలో నకిలీ పరికరాలను గుర్తించి సీజ్ చేసింది. ఈ ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోల్డ్మెడల్ కంపెనీ రీజినల్ హెడ్ నాగేశ్వర్రావు కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నీలం ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ షాపులో బ్రాండెడ్ ఎలక్ట్రికల్ పేరుతో నకిలీ పరికరాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి షాపులను నిర్వహిస్తూ ఇలాంటి నకిలీ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నకిలీ ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంతో వి ద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయని, ప్రజలు నకిలీ పరికరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. టౌన్ ఎస్సై విజయ్కుమార్ సమక్షంలో తనిఖీలు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.