
సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి
హసన్పర్తి: సీపీఐ హనుమకొండ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులుగా సిరబోయిన కర్ణాకర్, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, నద్దునూరి అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, మునిగాల భిక్షపతి, నేదునూరి రాజమౌళి, ఉట్కూరి రాములు (రైతు సంఘం), కర్రె లక్ష్మణ్ (వ్యవసాయ కార్మిక సంఘం), ఓదెలు, బాషబోయిన సంతోష్ (విద్యార్థి సంఘం), మంచాల రమాదేవి(మహిళా సమాఖ్య), జక్కుల రాజుగౌడ్ (ఏఐటీయూసీ)తోపాటు మరో 45 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
హనుమకొండ జిల్లాలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు వల్ల నిరుద్యోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీల అమలులో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ మహాసభలను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు భిక్షపతి కృతజ్ఞలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు పాల్గొన్నారు.

సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి

సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి