
‘ఆర్యువీ’పై వీసీలో సమీక్ష
వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బుధవారం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగా ఎలా పనిచేస్తుందో రెగ్యులర్గా అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి కలెక్టర్లుప్రావీణ్య, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.