సచివాలయం పక్కనే జీవశ్చవంలా.. | - | Sakshi
Sakshi News home page

సచివాలయం పక్కనే జీవశ్చవంలా..

Oct 8 2025 6:21 AM | Updated on Oct 8 2025 6:21 AM

సచివాలయం పక్కనే  జీవశ్చవంలా..

సచివాలయం పక్కనే జీవశ్చవంలా..

నగరి : పట్టణ పరిధి కశింమిట్ట సచివాలయ సమీపంలో నాలుగు రోజులుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నీరు, ఆహారం లేకుండా నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లేవారు గానీ, సచివాలయానికి వచ్చి వెళ్లేవారుగానీ, సిబ్బంది గానీ చూస్తూ వెళుతున్నారు తప్ప.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్నది తెలియరాలేదు. ఎండకు, వానకు ఎలాంటి చలనం లేకుండా అక్కడే పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ ప్రాంతంలో జీవశ్చవంలా పడి ఉన్నా అధికారులు ఎవ్వరూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణం తప్ప చలనం లేని ఇతని పరిస్థితిని ఆరా తీయాలనిని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement