
మరో రెండు కుంకీలు
పలమనేరు: మండలంలోని మొసలిమడుగు ఏనుగుల శిబిరానికి ఆదివారం మరో రెండు ఏనుగులను స్థానిక అటవీ అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడి క్యాంపునకు ఇప్పటికే కర్ణాటకలోని మైసూరునుంచి శిక్షణ పొందిన నాలుగు కుంకీ ఏనుగులను తరలించారు. దీంతోపాటు కుప్పం ఫారెస్ట్ పరిధిలోని రామకుప్పం మండలం ననియాల క్యాంపులోని వినాయక, జయంత్ అని పిలిచే రెండు కుంకీ ఏనుగులను అధికారులు ఇక్కడికి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. దీంతో ఇక్కడి క్యాంపులో మొత్తం ఆరు కుంకీలు ఉన్నాయి. వీటికి అవసరమైన మేతను అధికారులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ తెలిపారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో ఏనుగులను అదుపు చేయనున్నారు.