
ఆదర్శ గ్రామాల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఎంపిక చేసిన 5 ఆదర్శ గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల్లో వందశాతం సోలార్ విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఇందులో ఒక పంచాయతీని ఎంపిక చేసి మొదట శతశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. పెనుమూరు, గుడిపాలలోని బొమ్మసముద్రం, విజయపురంలోని పల్లూరు, చౌడేపల్లె, కల్లూరు పంచాయతీలను ఎంపిక చేశారన్నారు. వీటికి సంబంధించి సంబంధిత ఈఈలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అక్కడ వసతులు, సోలార్ విధానం పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారు ఎంత మంది ఉన్నవారు, ఇతర కేటగిరీ సర్వీసుల వివరాలు, మొత్తం సర్వీసుల సంఖ్య వివరాలు తీసుకుంటున్నామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తే కేంద్రం సంబంధిత పంచాయతీ అభివృద్ధి పనులకు రూ.కోటి నిధులు విడుదల చేస్తుందన్నారు.
దుప్పిని కాల్చి చంపిన కేసులో జైలు
కుప్పం : కుప్పం అటవీ రేంజ్ పరిధిలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిను కాల్చిన కేసులో నిందితుడిని రిమాండుకు పంపినట్లు అటవీ శాఖ అధికారి జయశంకర్ తెలిపారు. కుప్పం మండలం వాలూరు గ్రామానికి చెందినా కనకరాజ్ గుడుపల్లె మండలం మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వెటాడి నాటు తుపాకితో కాల్చి చంపినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు వచ్చినా సమాచారం మేరుకు మల్లప్పకొండ ప్రాంతంలో పర్యవేక్షించగా కనకరాజ్ దుప్పి చర్మంతో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా అదపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడితో పాటు నాటు తుపాకి , ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఆయన తెలిపారు.