● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే

Jun 1 2025 1:17 AM | Updated on Jun 1 2025 1:17 AM

● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే

● పార్టీ కార్యాలయం ప్రారంభించకనే వెనుదిరిగిన ఎమ్మెల్యే

తమ్ముళ్ల వాగ్వాదం

గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పంచాయతీలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్‌ థామస్‌ ఎదుటే తమ్ముళ్ల వాగ్వాదం చోటుచేసుకుంది. వింజం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛను అందించారు. అనంతరం వింజం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలి అంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించగా అదే గ్రామంలోని మరొక వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని మరో మండిపడింది. దీంతో ప్రారంభోత్సవం చేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ తతంగం అంతా నడిరోడ్డుపై జరగడంతో ట్రాఫిక్‌ అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అవకతవకలపై విచారణ

చిత్తూరు రూర ల్‌(కాణిపాకం): ఏపీ హంస అసోసియేషన్‌ అవకతవకలపై రాష్ట్ర వైద్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ నెల 3వ తేదిన డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ముందు హాజరు కావాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యకుడికి నోటీసులు జారీ చేసింది. ఏపీ హంస సంఘం బోగస్‌ సభ్యులను చూపుతున్నారని, బోగస్‌ ఎన్నికల నిర్వహిస్తున్నారని, డబ్బులకు ఆఫీస్‌ బేరర్ల పోస్టులు అమ్ముకుంటున్నారని, ఆ పోస్టుల ద్వారా బదిలీల నుంచి తప్పించేలా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అందుకే విచారణకు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement