చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రజలందరూ యోగా యాప్లో నమోదు కావాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై అవగాహన పెంచేందుకు మండల , గ్రామస్థాయి వరకు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని (మే 21 నుంచి జూన్ 21) వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కలిగించేలా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. నేటి నుంచి గ్రామస్థాయిలో యోగా పోటీలు ప్రారంభించాలన్నారు. 4756 మంది యోగా శిక్షకులుగా నమోదయ్యారన్నారు. అదే విధంగా జిల్లాలో 1,66,713 మంది ప్రజలు యాప్ లో నమోదయ్యారని చెప్పారు. జూన్ 21 నాటికి ప్రతి ఒక్కరు యోగాపై అవగాహన కలిగి, సాధన చేసే విధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.