
ఆటో బోల్తా పడి 12 మందికి గాయాలు
కశింకోట: కశింకోట–పెదపాడు రోడ్డులో బుధవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురం నుంచి అచ్యుతాపురానికి కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. సీఐ అల్లు స్వామినాయుడు అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఆటో బోల్తా పడి 12 మందికి గాయాలు