
నవతరానికి మేల్కొలుపు
జిల్లాలో మేడే వేడుకలు కార్మికులంతా ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. పతాకావిష్కరణలు జరిపారు. మే డే విశిష్టతను, కార్మిక పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్మిక హక్కులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ను రద్దు చేయాలని, కార్మికులకు సరైన భద్రతా ప్రమాణాలు, శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కుల,మత, ప్రాంతీయ ఉన్మాదాలను విడనాడాలని నినదించారు.
అనకాపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ