కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం | - | Sakshi
Sakshi News home page

కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం

May 1 2025 2:13 AM | Updated on May 1 2025 2:13 AM

కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం

కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం

కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు. స్వామికి వేకువ జామున వేద మంత్రాల నడుమ ఏడాది పొడవునా వేసిన చందనాన్ని తొల గించి నిజ రూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు బ్యాచ్‌ల వారీగా వచ్చి స్వామికి పంచామృతాలు, పండ్లు వగైరా సమర్పించి దర్శించుకున్నారు. భక్తులు తెచ్చిన పంచామృతాలైన తేనె, పాలు, పెరుగు,నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు, చందనంతో వేద మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించా రు. పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం వరకు నిజ రూప దర్శనం కల్పించ అనంతరం యధా విధిగా వేద మంత్రాల నడుమ చందనాన్ని పూశారు. మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు అత్తిలి కోదండపాణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement