పిడుగుపాటుకు వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Oct 9 2025 3:13 AM | Updated on Oct 9 2025 3:13 AM

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

చింతపల్లి : మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన బెన్నవరం పంచాయతీ చిన కొత్తపాలెంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాతవరం మండలం మన్యపురట్ల గ్రామానికి చెందిన ముత్తా రమణ (54) ఏజెన్సీలో వ్యాపార నిమిత్తం తరచూ వస్తుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వగ్రామం మన్యపురట్ల నుంచి మండలంలోని చినకొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో వర్షం పడుతుండగా చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement