రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

రాజవొమ్మంగి: స్థానిక శివాలయం వీధిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్టు తహసీల్దార్‌ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఐదు సంచుల్లో లభించిన 173 కిలోల బియ్యాన్ని సీజ్‌ చేసి, జడ్డంగిలోని ఎంఎల్‌ఎస్‌ గోదాంకు తరలించినట్టు చెప్పారు. రేషన్‌ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్‌ఐ చెల్లమ్మ, వీఆర్వో భూలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement