
సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం
అరకులోయలోని సబ్బుల తయారీ పరిశ్రమపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఉన్నతాధికారులు శీతకన్ను వేశారు. సబ్బుల ఉత్పత్తిని నిలిపివేయడంతో గోదాముల్లో ముడి సరకులు, మెషిన్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మరో వైపు సోప్ యూనిట్ కార్మికులను జీసీసీ బ్రాంచీల్లో సర్దుబాటు చేశారు. తక్కువ వేతనాలతో దూర ప్రాంతాల్లో పని చేయలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
అరకులోయటౌన్: గిరిజన సహకార సంస్థ 2008వ సంవత్సరంలో అరకులోయలో సోప్ యూనిట్ను (సబ్బుల తయారీ కేంద్రం) ఏర్పాటు చేసింది. నెలకు లక్ష సబ్బులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇక్కడ తయారు చేసిన సబ్బులను రాష్ట్రంలో (ఉమ్మడి ఏపీ) ఉన్న అన్ని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలకు సరఫరా చేసేవారు. డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం కూలీల కోసం సబ్బులు కొనుగోలు చేసేవారు. ఇంకా జీసీసీ డీఆర్ డిపోలకు కూడా సబ్బులు సరఫరా అయ్యేవి. దీంతో 2012లో సోప్ యూనిట్ను విస్తరించి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల సబ్బులకు, 2020లో మూడు లక్షల సబ్బుల తయారీకి పెంచారు. నీమ్ (వేప), అలోవేరా (కలబంద), టర్మరిక్ (పసుపు), జాస్మిన్ (మల్లె) రకం సబ్బులు తయారు చేసేవారు. కొద్ది నెలలుగా సోప్ యూనిట్లో సబ్బుల తయారీ నిలిచిపోయింది. ఫలితంగా 23 మంది సోప్ యూనిట్ కార్మికులకు పనిలేకుండా పోయింది. వారిని పలు మండలాల్లో ఉన్న బ్రాంచీ కార్యాలయాల్లో, డీఆర్ డిపోలలో, అరకులోయ బ్రాంచి కార్యాలయంలో కాఫీ గింజల గ్రేడింగ్ పనులకు వినియోగించుకుంటున్నారు.
● అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న ఏకై క జీసీసీ సోప్ యూనిట్ నిర్వహణను జీసీసీ ఉన్నతాధికారులు గాలికొదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీసీసీకి ఆదాయాన్ని సమకూర్చే సోప్ యూనిట్ నిర్వహణపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన సబ్బులను అప్పట్లో విజయనగరంలోని సోప్ యూనిట్కు తరలించారు.
● అరకులోయ జీసీసీ సోప్ యూనిట్లో 10 మంది పురు షులు, 13 మంది మహిళలు మొత్తం 23 మంది కార్మికులు పని చేస్తున్నారు. సోప్ యూనిట్ మూసివేయడంతో జీసీసీ అరకు బ్రాంచి పరిధిలోని డీఆర్డీఎఫ్, పెట్రోల్ బంక్, సూపర్ బజార్లలో కొంత మందిని సర్దుబాటు చేశారు. మిగిలిన మహిళా కార్మికులతో జీసీసీ ఆధీనంలో ఉన్న ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్ పరిసరాలు శుభ్రం చేయడం, పెట్రోల్ బంక్, జీసీసీ కార్యాలయం పరిసరాల్లో గడ్డి కోత, గార్డెనింగ్ పనులు చేయిస్తున్నారు. కార్మికులకు రెండు నెలలుగా జీతభత్యాలు జీసీసీ చెల్లించడం లేదు.
● జీసీసీ సోప్ యూనిట్లో 23 మంది కార్మికులు ప్రతి రోజు రూ.22.50 విలువ చేసే 100 గ్రాముల సబ్బులు 9 వేలు తయారు చేసేవారు. రూ.18.50 విలువ చేసే 75 గ్రామలు సబ్బులు 13 వేలు తయారు చేసేవారు. ప్రతి రోజు రూ.4.43 లక్షల విలువ చేసే సబ్బులు తయారు చేసేవారు.
సోప్ యూనిట్ తెరిపించాలి
గతంలో కార్మికులంతా కష్టపడి పనిచేసి సంస్థకు ఎంతో లాభాన్ని ఆర్జించి పెట్టాం. సోప్ యూనిట్ మూసివేతతో అనుభవం లేని పనులు అప్పగించారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పునః ప్రారంభానికి చర్యలు చేపట్టాలి. సంస్థకు లాభం వచ్చే యూనిట్ మూసివేయడం బాధాకరం.
– వంతాల సింహాద్రి, కార్మికుడు, సోప్ యూనిట్, అరకులోయ
పనిలో సంతృప్తి లేదు..
సోప్ యూనిట్లో పని చేస్తున్నప్పుడు ఆత్మసంతృప్తి ఉండేది. దాన్ని మూసివేయడంతో కార్యాలయం పరిసరాలు శుభ్రం చేయ డం, గార్డెనింగ్ పనులు చేస్తున్నా. ఈ పనిలో సంతృప్తి లేదు. ఉన్నతాధికారులు స్పందించి యూనిట్ తెరిపించాలి.
– కిల్లో లక్ష్మి,
కార్మికురాలు, సోప్ యూనిట్, అరకులోయ
అరకులోయలో మూతబడిన
జీసీసీ సోప్ యూనిట్
సబ్బుల తయారీ నిలిపివేత గోదాముల్లో మూలుగుతున్న నిల్వలు
పలు మండలాల్లోని జీసీసీ బ్రాంచీల్లో కార్మికుల సర్దుబాటు
రెండు నెలలుగా జీతాలందక అవస్థలు
టీ, కాఫీలు అందిస్తున్నా..
సోప్ యూనిట్ మూసివేయడంతో జీసీసీ కార్యాలయంలో పని కల్పించారు. గదులు శుభ్రం చేయడం, అధికారులకు టీ, కాఫీలు అందించడం వంటి పనులు చేస్తున్నా. సోప్ యూనిట్ తెరిపిస్తే బాగుంటుంది.
– పాంగి వరలక్ష్మీ,
కార్మికురాలు, సోప్ యూనిట్, అరకులోయ
ప్రభుత్వం దృష్టికి సమస్య
జీసీసీ సోప్ యూనిట్ మూతబడిన విషయం జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ దృష్టికి తీసుకువెళ్లాం. సోప్ యూనిట్ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
– పాంగి కోటేశ్వరరావు, మేనేజర్,
జీసీసీ సోప్ యూనిట్, అరకులోయ

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం

సోప్ యూనిట్ మూత..ఉపాధి దూరం