న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక | - | Sakshi
Sakshi News home page

న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక

Jun 4 2025 2:17 AM | Updated on Jun 4 2025 2:17 AM

న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక

న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక

కె.కోటపాడు: విశాఖపట్నంలోని న్యాయ విద్యాపరిషత్‌ లా కళాశాలలో 1993లో చదువులు సాగించిన పూర్వ విద్యార్థులు అనకాపల్లి జిల్లా చౌడువాడలో అపూర్వ కలయిక పేరుతో కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తరువాత స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. అల్లరి చేష్టలను తలచుకొని రోజంతా సంతోషంగా గడిపారు. కుటుంబాల యోగక్షేమాలను ఒకరికి ఒకరు తెలుపుకున్నారు. ఈ అపూర్వ కలయికకు చోడవరం న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్‌ సారథ్యం వహించారు. వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న వారు, న్యాయశాఖలో వివిధ హోదాల్లో స్థిరపడిన వారు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement