
‘బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్’కు ముగ్గురు ఎంపిక
ఆదిలాబాద్టౌన్/సాత్నాల: జటాదార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎన్జీవో ప్రతిష్టాత్మకంగా అందజేసే రాష్ట్రస్థాయి బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్ పురస్కారానికి జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇంద్రవెల్లి ఉన్నత పాఠశా ల పీజీహెచ్ఎం రాంమోహన్, భీంసరి ఉన్నత పాఠఽశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ నీలం వెంకట్, కెనాల్ మేడిగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిల్క సతీశ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాలలో వారు బోధిస్తున్న వినూత్న బోధన తీరు, వారి నిరంతర కృషికి గాను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 29న హైదరాబాద్లోని కళాభవన్లో ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని వెల్లడించారు.
చిలుక సతీశ్
నీలం వెంకట్
రాంమోహన్

‘బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్’కు ముగ్గురు ఎంపిక

‘బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్’కు ముగ్గురు ఎంపిక