
సజావుగా ఇంటర్వ్యూల ప్రక్రియ
కై లాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమి క విద్య (ప్రీ ప్రైమరీ స్కూల్స్)ను అందించేందుకు ప్రభుత్వం 19 ఇన్స్ట్రక్టర్, 19 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 38 పో స్టులకు 735మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎంపిక కోసం గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్రక్రియ సజావుగా సా గింది. కాగా, పోటీ తీవ్రంగా ఉండటంతో డీఎడ్ అ భ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించి నట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.