బతుకమ్మ.. బతుకుదెరువైంది
● ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్ కోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన పలువురికి ప్లాట్లు ఇప్పిస్తానని వారి నుంచి ఆయన డబ్బులు తీసుకున్నాడు. తీరా ప్లాట్లను చూపించకుండా మోసం చేశాడు. దీంతో ఆ ఉద్యోగిపై వన్టౌన్లో కేసు నమోదైంది.
● ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమాయకులకు విక్రయించాడు. ప్లాట్ చూపించకపోగా, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల ఫిర్యాదుతో ఉద్యోగితో పాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిపై వన్టౌన్లో కేసు నమోదైంది.
● జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ భూకుంభకోణం బయటపడింది. ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసే డీఈఈ, రిమ్స్లోని ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న మరో ఉద్యోగి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఏడు ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోట్లాది విలువైన ప్లాట్లను దండుకునేందుకునేలా వ్యవహరించారు. ఇందుకు గాను సబ్రిజిస్ట్రార్ ఏకంగా రూ.7లక్షల లంచం తీసుకుని పని కానిచ్చిన విషయం తెలిసిందే. వీరిపై మావల పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
● మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి ఇటీవల మరో జిల్లాకు పదోన్నతిపై వెళ్లాడు. ఆయన వెళ్లిన తర్వాత అక్రమాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ భూమికి అసెస్మెంట్ చేసి భారీగా దండుకున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో వన్టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
● జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ఎస్టేట్ దందాలో ఆరితేరాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను విక్రయిస్తూ పలువురిని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో ఆదిలాబాద్రూరల్ పోలీసుస్టేషన్లో అతడిపై కేసు నమోదైంది.
● జిల్లా విద్యాశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి అందినకాడికి డబ్బులు దండుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేశాడు. గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉండగా, ఇటీవల ఓ నిరుద్యోగి ఫిర్యాదుతో అతడిపై టూటౌన్లో కేసు నమోదైంది.
న్యూస్రీల్
బతుకమ్మ పండుగ సందర్భంగా పలువురు రైతులు బంతి తదితర పూల సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు.
గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
IIలోu
పనులు వేగవంతం చేయాలి
బోథ్: మండల కేంద్రంలో చేపట్టిన కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఈమేరకు బుధవారం నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా జడ్జికి బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. వారి వెంట అసోసియేషన్ అధ్యక్షుడు వామన్రావ్ దేశ్పాండే, ఏజీపీ శంకర్, న్యాయవాదులు విజయ్కుమార్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
1/1
బతుకమ్మ.. బతుకుదెరువైంది