పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

Sep 20 2025 6:04 AM | Updated on Sep 20 2025 6:04 AM

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

ఇచ్చోడ: మండల కేంద్రంలోని నిర్మల్‌ బైపాస్‌ వద్ద ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు పశువులను తీసుకెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నా రు. పది పశువులను స్వాధీనం చేసుకుని స్థానిక జైశ్రీరాం గోశాలకు తరలించారు. ఎస్సై పురుషో త్తం తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం శుక్రవారం ఉదయం నిర్మల్‌ బైపాస్‌ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో పశువులు ఉన్న ట్లు గమనించారు. స్థానికులను చూసిన వాహన డ్రై వర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాని కి చేరుకుని బొలెరో వాహనాన్ని పోలీస్టేషన్‌కు తరలించి పశువులను గోశాలకు అప్పగించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ఘటనలో బస్సు కండక్టర్‌కు స్వల్పగాయాలు కాగా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్టట్లు పేర్కొన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న పశువులు తరలిస్తున్న వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement