ఇద్దరు విద్యార్థుల అదృశ్యం | two students missing in hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

Feb 13 2015 4:50 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

హైదరాబాద్: ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తమ పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. వివరాలు... నగరంలోని కుషాయిగూడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు సాగర్, శాంతివర్ధన్‌రెడ్డి అదృశ్యమయ్యారు.

గురువారం సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు చేరుకోలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement