హత్య, రేప్ల వంటి దారుణ నేరాలకు పాల్పడిన మైనర్లకు విధించే శిక్షలకు సంబంధించిన చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ...
న్యూఢిల్లీ: హత్య, రేప్ల వంటి దారుణ నేరాలకు పాల్పడిన మైనర్లకు విధించే శిక్షలకు సంబంధించిన చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని సోమవారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ చట్టాలను బలోపేతం చేసే దిశగా మార్పులు అవసరమా అన్న విషయాన్ని కేంద్రం పరిశీలించాలని సూచించింది.
బాధితుల జీవితమూ విలువైనదే అనే సందేశం సమాజంలోకి వెళ్లేలా చట్టాల్లో చేయాల్సిన అవసరమైన మార్పుల గురించి నిపుణులను సంప్రదించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ఆదేశించింది. మైనర్లు దారుణ నేరాలకు పాల్పడుతుండడం ఇటీవల పెరగడంతో ఈ చట్టాల్లో మార్పులు అవసరమని స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. హత్యానేర నిందితుడికి పంజాబ్, హరియాణా హైకోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.