ఆర్టీసీ బస్సు ప్రమాదం: ఇద్దరి మృతి | RTC bus accident kills two | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ప్రమాదం: ఇద్దరి మృతి

Jun 14 2016 8:49 AM | Updated on Aug 30 2018 4:07 PM

వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గువ్వలదిన్నె ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి కండక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు.

-  35 మందికి గాయాలు

చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా)

వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గువ్వలదిన్నె ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి కండక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది.

 బెంగుళూరు నుంచి కడపకు వస్తున్న కడప డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 0928 నంబరుగల ఆర్టీసీ బస్సు గువ్వలచెరువు ఘాట్ రోడ్డు నాల్గవ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో కండక్టర్, మరోవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి బస్సులో ఇరుక్కుపోయాడు. అతను బతికే ఉన్నాడు. అతనిని క్షేమంగా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 108లో క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement